
సాఠాపూర్ గేటు వద్ద రోడ్డు ప్రమాదం: ఎలక్ట్రీషియన్ కు తీవ్ర గాయాలు
ఎడపల్లి మండలంలోని సాఠాపూర్ గేటు వద్ద మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా మాలపల్లికి చెందిన మొహమ్మద్ ఫరూక్ అబ్దుల్లా అనే ఎలక్ట్రీషియన్ కోటగిరిలో పని ముగించుకొని నిజామాబాద్ తిరిగి వస్తుండగా, సాతఠాపూర్ గేటు వద్ద బైక్ పై నుండి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు సమాచారం అందించడంతో బోధన్ 108 సిబ్బంది లక్ష్మణ్, కేశవకుమార్ అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స అందించి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందిని వైద్యులు అభినందించారు.





































