నవంబర్ 1న హైదరాబాద్లో జరగనున్న దళితుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని ఏమర్పిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరం పిలుపునిచ్చారు. పోతాంగల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. న్యాయమూర్తిపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై 23 రోజులు గడిచినా ఇంతవరకు కేసు నమోదు చేయకపోవడంపై, మానవహక్కుల కమిషన్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.