బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి అపహరించుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బోధన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.