నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ రూరల్ పరిధిలోని తెరపల్లి మండల కేంద్రంలో హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల పాటు వైన్స్ షాపులను మూసివేయాలని ఎస్సై ఎస్ శ్రీనివాస్ సూచించారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.