మంగళవారం ఇంటి నుంచి బయలుదేరిన కందకుర్తి గ్రామానికి చెందిన మిర్జా వాసత్ బేగ్ (60) అనారోగ్యంతో మనస్తాపం చెంది గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం సాయంత్రం కందకుర్తి గోదావరి నది ఒడ్డున అతని మృతదేహం తేలడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై చంద్రమోహన్ ఈ వివరాలను తెలిపారు.