బోధన్ అనీసానగర్కు చెందిన షేక్ యూసుఫ్ (55) అనే వంట మనిషి, కుటుంబ కలహాలు మరియు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆదివారం జానకంపేట అశోక్ సాగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎడపల్లి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.