నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో సోయా పంట కోతలు చేపట్టి 20 రోజులు గడిచినా, ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వర్షం పడితే ఎండబెట్టిన సోయా తడిసిపోతుందని వారు వాపోయారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.