బోధన్ పట్టణానికి చెందిన సాయికుమార్ (20), రోను చౌదరి (19) హోలీ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి మంజీర నదిలో స్నానానికి వెళ్లారు. అక్కడ ఊబిలో చిక్కుకుని ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. ఉదయం వరకు హోలీ సంబరాల్లో పాల్గొన్న యువకులు సాయంత్రానికి శవాలుగా మారడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయికుమార్ కుటుంబంలో తీరని లోటు ఏర్పడింది.