కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మేంగారం గ్రామంలో మంగళవారం రాత్రి 8:30 గంటలకు చిరుతపులి కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందిన వెంటనే అటవీ శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. గ్రామస్తులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.