కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రియురాలి సోదరులు దాడి చేయడంతో మనస్తాపం చెందిన ధ్రువ కుమార్ (19) అనే యువకుడు సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడేళ్లుగా ప్రేమించిన అమ్మాయి సోదరులకు ఈ విషయం తెలియడంతో వారు ధ్రువ కుమార్ పై దాడి చేశారు. ఈ ఘటనపై మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.