పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలంగాణలో నేడు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా, పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.