కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీలో శనివారం రాత్రి భార్య లక్ష్మి తన భర్త శివాజీని కొడవలితో అతిదారుణంగా నరికి హత్య చేసింది. ఈ కేసులో సోమవారం కామారెడ్డి పట్టణ పోలీసులు భార్య లక్ష్మిని రైల్వే స్టేషన్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై కామారెడ్డి సిఐ నరహరి వివరాలు వెల్లడించారు.