Mar 13, 2026, 04:03 IST/
సన్రైజర్స్ లీడ్స్.. ఎక్స్ ఖాతాపై సస్పెన్షన్
Mar 13, 2026, 04:03 IST
పాకిస్థాన్కు చెందిన స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ రూ.2.34 కోట్లకు కొనుగోలు చేయడంతో ఫ్రాంచైజీపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. వేలంలో సన్రైజర్స్ సీఈవో కావ్యా మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ లీడ్స్ ఖాతా సస్పెన్షన్కు గురవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనికి గల కారణాలపై ఎక్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు. యూజర్లు ఖాతాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే.. ‘అకౌంట్ సస్పెండెడ్. ఎక్స్ సస్పెండ్స్ అకౌంట్స్ దట్ వయోలేట్ ది ఎక్స్ రూల్స్’ అని సందేశం కనిపిస్తోంది.