
రెండవ విడత ఎన్నికలపై సమీక్షా
ఎన్నికల రెండవ విడత నిర్వహణ నేపథ్యంలో నిజామాబాద్ డివిజన్ పోలీస్ అధికారులతో సీపీ పి. సాయి చైతన్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల రెండవ విడత నిజామాబాద్ డివిజన్ పరిధిలో జరగనున్న నేపథ్యంలో, బందోబస్తు ఏర్పాట్లను డిచిపల్లి సర్కిల్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో చర్చించారు.




































