నిజామాబాద్ రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో, విద్యుత్ నగర్ కు చెందిన తోట పోశిబాబు (40) మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం సాయంత్రం కాంటేశ్వర్ బైపాస్ వద్ద ఈ సంఘటన జరిగింది. కోర్టులో ప్రవేశపెట్టగా, అతనికి 7 రోజుల రిమాండ్ విధించినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.