నిజామాబాద్ రూరల్ సిరికొండ మండలంలో మొన్న రాత్రి నుండి ఉదయం 5 గంటల వరకు కురిసిన భారీ వర్షం కారణంగా కొండూరు వాగు ఉప్పొంగి, తాత్కాలిక రోడ్డు తెగిపోయింది. దీంతో రైతులు పండించిన వరి పంట నేలకొరిగి, వర్షానికి తడిసిపోయింది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భారీ వర్షాల వల్ల కోతలు నిలిచిపోయాయి. రైతులు వరి ధాన్యాన్ని ప్లాస్టిక్ కవర్లతో కప్పి రక్షణ చర్యలు చేపడుతున్నారు.