నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలోని డిచ్పల్లి, మోపాల మండలాలతో పాటు పలు మండలాల్లో మొన్నటి తుఫాను, ఈరోజు ఉదయం కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తడిసిన ధాన్యానికి, ఎండు ధాన్యానికి ఒకే రేటు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మద్దతు ధర కల్పించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.