ధర్పల్లి మండలం మోదిన్ సాబ్ బాయి తాండ వాసులు, చేరుతండ గ్రామపంచాయతీలో సర్పంచ్ పదవిని ఒకసారి తాము, మరోసారి అవతలివారు తీసుకుంటామని బాండ్ పేపర్ పై ఒప్పందం చేసుకుని, ఇప్పుడు మోసం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో సర్పంచ్ గా ఉన్నవారు అభివృద్ధి పనులు, పథకాలు అందించలేదని, ఇప్పుడు స్థానిక ఎన్నికల నేపథ్యంలో మోదిన్ సాబ్ తండా వాసులు నాలుగు లక్షల రూపాయలకు వేలం పాట పాడి తమను అడగకుండా ఏకగ్రీవం చేసుకున్నారని ప్రశ్నిస్తూ, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.