నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. గురువారం, మే 07న ఉదయం శ్రీనగర్ కాలనీలో ఇద్దరు యువకులు బైక్పై వచ్చి మహిళ మెడలోని మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయారు. వీరు మహారాష్ట్రకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. అంతకుముందు మూడో టౌన్ దుబ్బ ప్రాంతంలో వాకింగ్ చేస్తున్న మహిళ మెడలో నుంచి కూడా గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించారు, కానీ ఆమె అప్రమత్తం కావడంతో విఫలమయ్యారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.