హనుమాన్ జయంతి సందర్భంగా, గురువారం నగరంలోని గంజ్ మార్కెట్ యార్డులో వ్యాపార లావాదేవీలు జరగవని మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుంచి యార్డులో వ్యాపార కార్యకలాపాలు, కొనుగోళ్లు, అమ్మకాలు యథావిధిగా కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని వ్యాపారులు, రైతులు గమనించాలని ఆయన సూచించారు.