ధర్పల్లి మాల సంఘం ఆవరణలో సోమవారం జరిగిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని తాహసీల్దార్ టి. శాంత పరిశీలించారు. ఓటరు నమోదు, వివరాల సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను ఆమె పర్యవేక్షించి, అధికారులకు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు మెంబర్ లలిత కూడా పాల్గొన్నారు.