తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మేడారంలో అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 'కాంట్రాక్టుల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారు. మేడారం జాతరకు ఇంతవరకు దేవాదాయ శాఖ మంత్రి రాలేదు. రూ.250 కోట్లు ఖర్చు చేశాం అంటున్నారు. 200 బాత్రూమ్లు కూడా కట్టినట్టు లేరు. మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని ఎన్ని సార్లు అడిగినా కేంద్రం పట్టించుకోవడం లేదు' అని అన్నారు.