నిజామాబాద్ నగరంలోని కొన్ని షాపింగ్ మాల్స్ ఆఫర్ల పేరుతో కస్టమర్లను మోసం చేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. 70% వరకు ఆఫర్ ఉందని డిస్ప్లేలు పెట్టి, బిల్లింగ్ సమయంలో ఆఫర్ లేదని చెప్పి మోసం చేస్తున్నారని కస్టమర్లు వాపోయారు. నిజామాబాద్ అర్బన్ లోని ఒక షాపింగ్ మాల్ లో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేస్తున్నారు.