శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం నగరంలోని హమాల్వాడి సంతోషి మాత (సాయిబాబా) ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో పోలీసులు డీజే వాహనాన్ని అనుమతి లేదని అడ్డుకున్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా జోక్యం చేసుకుని పోలీసులతో మాట్లాడినా ఫలితం లేకపోవడంతో, స్వయంగా డీజే వాహనాన్ని నడిపి శోభాయాత్రను ముందుకు తీసుకెళ్లారు.