నగరంలోని దుబ్బా సబ్స్టేషన్ పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని నగర టౌన్-2 ఏడీఈ ఆర్. ప్రసాదొడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 11 కేవీ గిరిరాజ్ కళాశాల ఫీడర్లో మరమ్మతుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దుబ్బా పరిధిలోని గౌతంనగర్, దాబ్బా, రాజీవ్నగర్, గిరిరాజ్ కళాశాల ప్రాంతం, బైపాస్ రోడ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు సహకరించాలని కోరారు.