జిల్లాకేంద్రంలో బ్యాంక్ డబ్బులు జమచేయడానికి వెళ్తున్న బంగారు వర్తకుడి సహాయకుడి వద్ద నుంచి రూ. 19.20 లక్షలు కారులో వచ్చి దోచుకున్న ముగ్గురు నిందితులను 3వ టౌన్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నాందేవ్వడ ఫ్లైఓవర్ వద్ద జరిగిన ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన వినోద్ శంకర్ పవార్, అమర్ దా మోదర్ చర్వాద్, నౌషద్ ఖాదర్ సయ్యద్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ. 1.50 లక్షల నగదు, 3 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించారు.