ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గత వారం రోజులుగా జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో, రైల్వే పట్టాలకు ఆనుకొని నీటి ప్రవాహం వెళ్ళింది. దీంతో నిజామాబాద్ నుంచి పండరీపూర్ కు వెళ్లాల్సిన రైలును రైల్వే శాఖ అధికారులు రద్దు చేశారు.