నిజామాబాద్ కమిషరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లను అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో భాగంగా వెయిటింగ్లో ఉంచి, జిల్లాలోని వేరే ఠాణాలకు బదిలీ చేశారు. సీసీఎస్లో పనిచేస్తున్న ఎస్సై జీ మహేష్ను జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ చేయగా, గ్రూప్స్ పరీక్షల సన్నద్ధత కోసం సెలవుపై వెళ్లిన ఎస్సై స్థానంలో ఆయనను తాత్కాలికంగా నియమించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు.