దేశంలో వైద్య విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) కీలక నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్ కోర్సు, ఇంటర్న్షిప్ను పూర్తి చేయడానికి గరిష్ట గడువును 9 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతూ కొత్త డ్రాఫ్ట్ అమెండ్మెంట్ను జారీ చేసింది. ఈ సవరణతో
విద్యార్థులు, మెడికల్ కాలేజీలు ఎదుర్కొంటున్న ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు. అయితే, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి 4 అటెంప్టుల పరిమితి యథాతథంగా కొనసాగుతుందని NMC స్పష్టం చేసింది.