యూపీఐ ప్లాట్ఫాం లావాదేవీలపై భవిష్యత్తులో ఎలాంటి ఛార్జీలు విధించబోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్పష్టం చేసింది. యూపీఐ వినియోగదారుల కోసం ఉచితంగా కొనసాగుతుందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులపై అదనపు ఫీజులపై వచ్చిన అనుమానాలను తిప్పికొట్టిన ఆయన.. ప్రభుత్వం, RBI కలిసి యూపీఐని ‘జీరో కాస్ట్’ ప్లాట్ఫారంగా కొనసాగించాలన్న దృఢమైన నినాదంతో ఉందని తెలిపారు.