చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇరాన్ నౌకాశ్రయాలను అమెరికా దిగ్బంధించడంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.. ఇరాన్ అణు ఒప్పందం చేసుకునే వరకు హర్మూజ్ దిగ్బంధనం కొనసాగతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో ముడి చమురు ధరలు పైకి ఎగబాకాయి. దీంతో అంతర్జాతీయంగా బ్రెండ్ క్రూడ్ బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరింది. 2022 తర్వాత ఇంతగా పెరగడం ఇదే తొలిసారని చెబుతున్నారు.