
ప్రధాని మోదీని కలిసిన వరల్డ్ కప్ మహిళా ఛాంపియన్లు
వన్డే ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా మహిళా ఛాంపియన్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. పీఎం నివాసంలో ఒక్కో ప్లేయర్ను మోదీ ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు. వరుసగా మూడు ఓటముల తర్వాత టీమ్ఇండియా అద్భుతమైన పునరాగమనం చేసిందని కొనియాడారు. కాగా బంగ్లాదేశ్తో మ్యాచులో గాయపడిన ప్రతికా రావల్ వీల్ఛైర్లో వచ్చారు.




