యూపీలో ప్రతాప్గఢ్లోని తాజ్పూర్ సరియావా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎస్పీ నాయకుడు తన్వీర్ మిల్కీ తన సోదరుడు సోహ్రాబ్తో కలిసి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపాడు. పిల్లల మధ్య వివాదం కారణంగా జరిగిన ఈ కాల్పుల్లో ఫుర్కాన్ మరణించగా, సాహిల్ తీవ్రంగా గాయపడ్డాడు. నెలల తరబడి తన్వీర్, ఫుర్కాన్ మధ్య వైరం కొనసాగుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితులిద్దరినీ అరెస్టు చేసి, హత్యకు ఉపయోగించిన లైసెన్స్డ్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.