జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్
ఇండియా విమాన ప్రమాదం జరిగి ఏడాది పూర్తయింది. ఈ దుర్ఘటనలో 275 మందికి పైగా మరణించగా, 11A సీట్లో కూర్చున్న రమేశ్ విశ్వాస్ అనే ప్రయాణికుడు ఒక్కడే ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు.
విమానం ముక్కలై మంటల్లో చిక్కుకున్నా ఆయన సురక్షితంగా బయటపడటం వైద్యులను, పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. ఈ ఘోర ప్రమాదం జరిగి ఏడాది గడిచినా, బాధితుల కుటుంబాల్లో నెలకొన్న శోకం, ఆ భయానక దృశ్యాలు నేటికీ ప్రజల మదిలో పచ్చిగానే ఉన్నాయి.