సర్పంచ్ పదవికి బహిరంగ వేలం.. రూ. 55 లక్షలకు దక్కించుకున్నాడు(వీడియో)

9571చూసినవారు
TG: పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో ఏకగ్రీవాల కోసం పార్టీలు వేలం పాటలు నిర్వహిస్తూ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే వేలంపాటలు చట్టవిరుద్ధమని ఈసీ చెబుతున్నా కొందరు లెక్కచేయడం లేదు. తాజాగా రంగారెడ్డి (D) బ్రాహ్మణపల్లిలో సర్పంచ్ పదవికి బహిరంగంగా వేలం నిర్వహించి రూ. 55 లక్షలకు అమ్మేశారు. ఈ వేలంలో ముగ్గురు పోటీ పడగా ఓ వ్యక్తి రూ. 55 లక్షలకు దక్కించుకున్నాడు. అయితే ఈ వేలంపాటను అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా రూ.కోటికిపైగా చెల్లించాలని కండీషన్ పెట్టడం కొసమెరుపు.

సంబంధిత పోస్ట్