అరుణాచల్ప్రదేశ్ను తమదేనంటూ చైనా చేస్తున్న ప్రచారంపై అరుణాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు స్పందించారు. తమ రాష్ట్రం 1200 కిలోమీటర్ల సరిహద్దును టిబెట్తో పంచుకుంటోందని, చైనాతో మాత్రం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం టిబెట్ చైనా అధీనంలో ఉన్నా, భౌగోలికంగా తాము టిబెట్తోనే సరిహద్దును పంచుకుంటున్నామన్నది వాస్తవమని తెలిపారు.