
చేనేత కార్మికుల గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత పథకం అమలు
చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. ఉచిత విద్యుత్ పథకాన్ని ఆమోదించి, ఆర్థిక శాఖ పెండింగ్లో ఉంచవద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెల మగ్గానికి 200 యూనిట్లు, మరమగ్గానికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలని సూచించారు. ఈ పథకం అమలుతో చేనేత కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.




