మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఎక్స్ ఖాతా హ్యాకింగ్కు గురైంది. ఆదివారం ఆయన ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు పాకిస్థాన్, టర్కీ జెండాల చిత్రాలను పోస్టు చేశారు. ఆసియా కప్లో భారత్-పాక్ మ్యాచ్కు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. సుమారు 30-45 నిమిషాల తర్వాత ఖాతాను తిరిగి నార్మల్ స్టేజ్కి వచ్చినట్టు అధికారులు తెలిపారు. గతంలో జార్ఖండ్ ముక్తి మోర్చా, కాంగ్రెస్ అస్సాం యూనిట్ ఖాతాలు కూడా హ్యాకింగ్కు గురైన సంగతి తెలిసిందే.