ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ పవర్ ప్లే ముగిసింది. ఆరు ఓవర్లకు పాకిస్తాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 55 పరుగులు చేసింది. క్రీజులో సాహిబ్జాదా ఫర్హాన్ (29), సైమ్ అయూబ్ (10) ఉన్నారు. టీమిండియా బౌలర్లలో హార్దిక్ పాండ్య మాత్రమే ఒక వికెట్ తీయగలిగారు. పవర్ ప్లే అనంతరం కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అటాక్ ప్రారంభించాడు.