TG: అనుమానాస్పద స్థితిలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతికకాయం హైదరాబాద్కు చేరుకుంది. సికింద్రాబాద్లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్కు భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విజిటర్స్కు అనుమతినిచ్చారు. సాయంత్రం తిరుమలగిరి బాప్టిస్ట్ సమాధి తోటలో ప్రవీణ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో క్రైస్తవులు, అభిమానులు తరలివస్తున్నారు.