స్టార్ నటి పాయల్ రాజ్పుత్ స్టేజీపై కంటతడి పెట్టుకున్నారు. 'ఫస్ట్ టైమ్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. 'మా నాన్న క్యాన్సర్ బారిన పడిన సమయంలోనే నేను జైపూర్లో విపాసన ట్రీట్మెంట్ కోసం వెళ్లా.. మా కుటుంబానికి అది చాలా కష్ట సమయం' అంటూ కంటతడి పెట్టుకున్నారు. అక్కడే ఉన్న మూవీ టీమ్ ఓదార్చే ప్రయత్నం చేసినా.. వేదికపై ఉండలేక పాయల్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.