ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్లో ముల్లాంపూర్ స్టేడియంలో ఇది చివరి మ్యాచ్. భారత వాతావరణ శాఖ ప్రకారం.. 20-30 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఓవర్లు తగ్గినా, మ్యాచ్ పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్, తమ హోమ్ గ్రౌండ్లో చివరి మ్యాచ్ గెలవాలని చూస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.