పెద్దాపూర్ శివారులోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో గల్లంతైన విఠల్, లావణ్యల ఆచూకీ శుక్రవారం నాటికి లభించలేదు. పోలీసులు, 14 మంది బృందాలుగా కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏఖీన్ పూర్, నాగులపేట, సంగెం, గుంలాపూర్, మేడిపల్లి మండలాల పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ వెంబడి విస్తృతంగా వెతికారు. అయినప్పటికీ, వారి ఆచూకీని కనుగొనడంలో ఎటువంటి ఫలితం రాలేదు.