గురువారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా ప్రజలు భారీ ఆశలు పెట్టుకున్నారు. మానేరు చెక్ డ్యాంల ధ్వంసంపై స్పందన, KNR-జగిత్యాల ఫోర్ లైన్ పెండింగ్ ప్రాజెక్టు, ఓదెల, కొండగట్టు ఆలయాల మాస్టర్ ప్లాన్పై సీఎం కీలక ప్రకటన చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. రేపటి పర్యటనలో ఆయన జిల్లాకు ముఖ్య నిర్ణయాలు ప్రకటిస్తారో లేదో అని జిల్లా వాసులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.