శనివారం పెద్దపల్లిలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలో, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉపాధ్యాయులకు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభ్యసన
ఫలితాలు, పనితీరు గ్రేడింగ్ సూచికలు, లెర్నింగ్ మేనేజ్మెంట్, సమర్థవంతమైన తరగతి గది బోధనపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నాణ్యమైన విద్యలో జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని ఆయన తెలిపారు.