కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే లోడింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యత ప్రమాణాలు పూర్తి చేసిన ధాన్యాన్ని వెంటనే లారీల్లో లోడ్ చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచించారు.