పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పద్ధతులలో నెల రోజులలో మార్పు కనిపించాలని సూచించారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అకాడమిక్ ప్యానెల్ బృందాల పాఠశాలల పరిశీలనపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 12 వరకు మొదటి విడుతలో 30 ఉన్నత పాఠశాలల్లో అభ్యాసన పద్ధతులను మెరుగుపరిచేందుకు తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు.