ధర్మారంలోని స్మార్ట్ కిడ్స్ స్కూల్లో శనివారం ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమాదేవి, కరస్పాండెంట్ మహేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.