రాష్ట్ర ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు ఆదివారం సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, బొంతకుంటపల్లి, రంగంపల్లి, కోమండ్లపల్లి, నీరుకుల్ల గ్రామాల్లో రైతులకు ఎల్లమ్మ కాలువ ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు రూ. 20 లక్షల వ్యయంతో కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. కాలువ పూడికకు కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఆధునీకరణ పనుల ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.