
ట్రంప్ ఆగ్రహం: బీరూట్ దాడిపై ఇజ్రాయెల్కు వార్నింగ్
లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. ఈ దాడి అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందాన్ని ప్రమాదంలో పడేసిందని ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని చెబుతూనే, ఈ దాడి చాలా చిన్నదని, ఇందులో ఎవరూ చనిపోలేదని, గాయపడలేదని ట్రంప్ పేర్కొన్నారు. లెబనాన్పై ఇకపై దాడులు జరగకూడదని, శాంతి ఒప్పందాన్ని నాశనం చేయొద్దని ట్రంప్ ఇజ్రాయెల్కు తేల్చి చెప్పారు.




